జమ్మూకశ్మీర్లో కశ్మీరీ పండిట్పై ఉగ్రవాదుల దాడి
ABN , First Publish Date - 2022-04-05T02:18:45+05:30 IST
జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులు మరోమారు చెలరేగిపోయారు. షోపియాన్ జిల్లాలోని చోటోగామ్లో
షోపియాన్: జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులు మరోమారు చెలరేగిపోయారు. షోపియాన్ జిల్లాలోని చోటోగామ్లో షాప్ కీపర్ అయిన ఓ కశ్మీరీ పండిట్పై కాల్పులు జరిపారు. బాధితుడిని సోను కుమార్ బాల్జీగా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
కాగా, గత 24 గంటల్లో ఉగ్రవాదులు ఏడుగురిపై కాల్పులు జరిపారు. పుల్వామాలో జరిగిన దాడిలో గాయపడిన వారిలో నలుగురు స్థానికేతరులు కూడా ఉన్నారు. శ్రీనగర్లో జరిగిన దాడిలో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు గాయపడ్డారు.