కశ్మీర్ సమస్య పరిష్కారమవ్వాలి: ఐరాస
ABN , First Publish Date - 2022-01-23T07:41:18+05:30 IST
భారత్, పాకిస్థాన్ల మధ్య చాలా కాలంగా నలుగుతున్న కశ్మీర్ సమస్య శాంతియుత విధానంలో పరిష్కారమవుతుందని ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటెరస్ ఆశాభావం వ్యక్తం చేశారు. కశ్మీర్ అంశంపై పాకిస్థాన్కు చెందిన ఒక జర్నలిస్టు వేసిన ప్రశ్నకు ఆయన స్పందించారు...
న్యూయార్క్,జనవరి 22: భారత్, పాకిస్థాన్ల మధ్య చాలా కాలంగా నలుగుతున్న కశ్మీర్ సమస్య శాంతియుత విధానంలో పరిష్కారమవుతుందని ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటెరస్ ఆశాభావం వ్యక్తం చేశారు. కశ్మీర్ అంశంపై పాకిస్థాన్కు చెందిన ఒక జర్నలిస్టు వేసిన ప్రశ్నకు ఆయన స్పందించారు. ‘‘కశ్మీర్పై సాయం చేసేందుకు నేను పలుమార్లు ముందుకొచ్చాను. ఈ అంశం పరిష్కారం అన్ని వర్గాలకు, ప్రజలకు ఆమోదయోగ్యమైనది, వారికి శాంతిభద్రతలను అందించేదే కాక.. మానవ హక్కుల్ని గౌరవిం చే విధానంలో ఉండాలి’’ అన్నారు. కాగా.. 1972లో భారత్, పాకిస్థాన్ల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం కశ్మీర్పై మూడో దేశం లేదా వర్గం జోక్యం చేసుకోరాదు. ద్వైపాక్షిక చర్చలు, శాంతియుత విధానాల్లోనే కశ్మీర్ సమస్యను పరిష్కరించుకోవాలని ఇరు దేశాల ప్రభుత్వాలు ఆ ఒప్పందంలో నిర్ణయించాయి.