Kashmir తగులబడుతుంటే.. ఢిల్లీ పెద్దలు ఇంకో బిజీలో ఉన్నారు: Sanjay raut
ABN , First Publish Date - 2022-06-05T23:57:15+05:30 IST
కశ్మీర్ మళ్లీ తగులబడుతోందని, అక్కడి పరిస్థితి అదుపు తప్పిందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్..
న్యూఢిల్లీ: కశ్మీర్ (Kashmir) మళ్లీ తగులబడుతోందని, అక్కడి పరిస్థితి అదుపు తప్పిందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ (Sanjay Raut) అన్నారు. ఇంత జరుగుతుంటే ఢిల్లీలోని కీలక వ్యక్తులు (Central govt) మాత్రం సినిమాలను ప్రమోట్ చేయడంలో బిజీగా ఉన్నారని విమర్శించారు. బాలీవుడ్ చిత్రం ''సమ్రాట్ పృధ్వీరాజ్'' (Samrat Prithviraj) ప్రత్యేక ప్రదర్శన (Special Screening)కు కేంద్ర హోం మంత్రి అమిత్షా (Amit sha) హాజరైన నేపథ్యంలో ఆయన తాజా కామెంట్లు చేశారు. కశ్మీర్ పండిట్ల గోడు వినేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదని, దీంతో బలవంతంగా వారు ఆందోళనకు దిగాల్సి వస్తోందని, అసలు ప్రభుత్వం ఏమి చేస్తోందని సంజయ్ రౌత్ నిలదీశారు.
అయోధ్యకు వెళ్తున్నాం..
మహారాష్ట్ర మంత్రి ఏక్నాథ్ షిండే తదితరులతో తాను అయోధ్యకు ఆదివారం (జూన్ 5) వెళ్తున్నానని, ఆదిత్య థాకరే ఈనెల 15న అయోధ్య సందర్శించనున్నారని సంజయ్ రౌత్ తెలిపారు. తమ పర్యటన వెనుక ఎలాంటి రాజకీయ ఎజెండా లేదని చెప్పారు.