టీఆర్‌ఎస్‌ ఆస్ట్రేలియా శాఖ అధ్యక్షుడిగా కాసర్ల నాగేందర్‌ రెడ్డి

ABN , First Publish Date - 2022-09-09T14:17:09+05:30 IST

టీఆర్‌ఎస్‌ పార్టీ ఆస్ట్రేలియా శాఖ అధ్యక్షుడిగా కాసర్ల నాగేందర్‌ రెడ్డి మూడోసారి నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, టీఆర్‌ఎస్‌ ఎన్నారై కో ఆర్డినేటర్‌ మహేష్‌ బిగాల ఆయనకు నియామక పత్రం అందజేశా

టీఆర్‌ఎస్‌ ఆస్ట్రేలియా శాఖ అధ్యక్షుడిగా కాసర్ల నాగేందర్‌ రెడ్డి

  • నియామక పత్రం అందజేసిన ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్‌, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): టీఆర్‌ఎస్‌ పార్టీ ఆస్ట్రేలియా శాఖ అధ్యక్షుడిగా కాసర్ల నాగేందర్‌ రెడ్డి మూడోసారి నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, టీఆర్‌ఎస్‌ ఎన్నారై కో ఆర్డినేటర్‌ మహేష్‌ బిగాల ఆయనకు నియామక పత్రం అందజేశారు. 2016లో ఆస్ట్రేలియాలో టీఆర్‌ఎస్‌ శాఖను స్థాపించి మొదటిసారి అధ్యక్షుడిగా ఎన్నికైన నాగేందర్‌ రెడ్డి.. ఆస్ర్టేలియా వ్యాప్తంగా టీఆర్‌ఎ్‌సకు అత్యధిక సభ్యత్వాలను నమోదు చేయించినట్లు మహేశ్‌ బిగాల పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఖండాంతరాలలో చాటి చెప్పి పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారని తెలిపారు. పార్టీ కోర్‌ కమిటీలో అనిల్‌రావు, రాజే్‌షగిరి రాపోలు, సాయిరామ్‌, రవిశంకర్‌, రవీందర్‌, రవి సాయల, రాకేష్‌ విశ్వామిత్రతోపాటు 150 మంది ఉన్నారు. 


Updated Date - 2022-09-09T14:17:09+05:30 IST