కరుణించమ్మా..దుర్గమ్మ..

ABN , First Publish Date - 2022-05-27T05:00:33+05:30 IST

వాల్మీకిపురం పట్టణం కొత్త ఇందిరమ్మ కాల నీలో వెలసిన దుర్గా దేవి అమ్మవారి జాత ర మహోత్సవం గురు వారం వైభవంగా నిర్వహించారు.

కరుణించమ్మా..దుర్గమ్మ..
వాల్మీకిపురంలో దుర్గాదేవికి బోణాలు సమర్పిస్తున్న మహిళలు

వాల్మీకిపురం, మే 26: వాల్మీకిపురం పట్టణం కొత్త ఇందిరమ్మ కాల నీలో వెలసిన దుర్గా దేవి అమ్మవారి జాత ర మహోత్సవం గురు వారం వైభవంగా నిర్వహించారు. ఉద యం నుంచి అమ్మవా రికి అభిషేకాలు, విశేష అలంకరణలతో ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం మహిళలు దీలు, బోణాలతో ప్రదర్శనగా వచ్చి అమ్మవారికి చెల్లిస్తూ మొక్కులు తీర్చుకు న్నా రు. ఈసందర్బంగా భక్తులకు అన్న ప్రసాద వితరణ చేపట్టారు.  ఆలయ కమిటీ సభ్యులు, యువత, మహిళలు పాల్గొన్నారు. 

వైభవంగా ఆంజనేయస్వామి తిరుణాల


గుర్రంకొండ, మే 26:గుర్రంకొండ మండలం సరిమడుగు పంచాయతీ కృష్ణాపురంలో వెలసిన ఆంజనేయ స్వామి ఆలయంలో  తిరుణాల గురు వారం వైభవంగా నిర్వహించారు. ఇందు లో భాగంగా ఉదయాన్నే స్వామి వారికి అర్చన, అభిషేకాలను చేసి ఆకు పూజ చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్ని మొక్కులు తీర్చుకొన్నారు. భక్తులకు అన్న దానాన్ని గ్రామస్థులు ఏర్పాటు చేశారు.

Updated Date - 2022-05-27T05:00:33+05:30 IST