Chess board: కరుణ సమాధికి చెస్‌ బోర్డు అలంకరణ

ABN , First Publish Date - 2022-07-29T15:11:56+05:30 IST

స్థానిక మెరీనా తీరంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి దివంగత కరుణానిధి(Karunanidhi) సమాధికి చదరంగం బోర్డు తరహాలో నలుపు, తెలుపు రంగుల్లో

Chess board: కరుణ సమాధికి చెస్‌ బోర్డు అలంకరణ

అడయార్‌(చెన్నై), జూలై 28: స్థానిక మెరీనా తీరంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి దివంగత కరుణానిధి(Karunanidhi) సమాధికి చదరంగం బోర్డు తరహాలో నలుపు, తెలుపు రంగుల్లో అలంకరించారు. మహాబలిపురంలో 44వ చెస్‌ ఒలంపియాడ్‌ పోటీల సందర్భంగా ఈ తరహాలో కలైంజర్‌ సమాధికి అలంకరణ చేశారు. ఈ పోటీల నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వం(State Govt) అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బస్సులు, రైళ్ళు మాత్రమేకాకుండా కొన్ని ప్రైవేట్‌ విమానాలపై కూడా ఈ పోటీలకు ప్రచారం చేశారు. అలాగే, డీఎంకే మాజీ అధ్యక్షుడు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి(Former Chief Minister) దివంగత కరుణానిధి సమాధిని కూడా చెస్‌ బోర్డు(Chess board) తరహాలో అలంకరించారు. సాధారణంగా ఈ సమాధిని ఒక్కో రోజు ఒక్కో విధంగా ఆలకంరించిస్తున్న విషయం తెలిసిందే.

Updated Date - 2022-07-29T15:11:56+05:30 IST