ఘనంగా కార్తీక పౌర్ణమి
ABN , First Publish Date - 2020-11-30T05:08:12+05:30 IST
కార్తీక పౌర్హమి సందర్భంగా జిల్లాలోని ప్రసిద్ధి శైవక్షేత్రాల్లో మహిళలు పెద్దఎత్తున భక్తిశ్రద్ధలతో కార్తీక దీపాలు వెలిగించారు.
పలు ఆలయాల్లో జ్వాలా తోరణాలు
కడప (మారుతీనగర్), నవంబరు 29 : కార్తీక పౌర్హమి సందర్భంగా జిల్లాలోని ప్రసిద్ధి శైవక్షేత్రాల్లో మహిళలు పెద్దఎత్తున భక్తిశ్రద్ధలతో కార్తీక దీపాలు వెలిగించారు. పలు ఆలయాల్లో జ్వాలాతోరణాలు వెలిగించారు. పుష్పగిరి, పొలతల, గుండాలకోన, నాగనాదేశ్వరకోన, కడప నగరంలోని మోచంపేట శివాలయం, గడ్డిబజారు శివాలయం, దేవునికడప సోమేశ్వరాలయం, మృత్యుంజయకుంట శివాలయాల్లో మహిళలు పెద్దఎత్తున కార్తీక దీపాలు వెలిగించారు.