సంధ్యాదీపం సకల శుభదాయకం

ABN , First Publish Date - 2020-12-06T05:19:33+05:30 IST

పవిత్రమైన కార్తీక మాసంలో వెలిగించే సంధ్య దీపం సకల శుభదాయకమని పుష్పగిరి పీఠాధిపతి విద్యాశంకర భారతీ స్వామి అన్నారు.

సంధ్యాదీపం సకల శుభదాయకం
లక్ష దీపోత్సవంలో పుష్పగిరి పీఠాధిపతి

పుష్పగిరి పీఠాధిపతి విద్యాశంకర్‌ భారతీ స్వామి

చెన్నూరు, డిసెంబరు 5: పవిత్రమైన కార్తీక మాసంలో వెలిగించే సంధ్య దీపం సకల శుభదాయకమని పుష్పగిరి పీఠాధిపతి విద్యాశంకర భారతీ స్వామి అన్నారు. చెన్నూరు బెస్త కాలనీ గంగమ్మ ఆలయం వద్ద లక్ష దీపాలను వెలిగించారు. అనంతరం మాట్లాడుతూ కార్తీక మాసంలో ఏ పుణ్యకార్యం చేసినా అది కోటి రెట్లు ఫలితం ఇస్తుందని, ఏడాదిలో ఒక్క రోజు వెలిగించే సంధ్య దీపం ఏడాదంతా కుటుంబానికి వెలుగు అందించేదిగా ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ కార్తీక మాసమంతా దీపాలు వెలిగించి శివకేశవులను ఆరాధించాలన్నారు. అన్ని మాసాల్లో దీపానికి ప్రత్యేక మాసం కార్తీక మాసం అన్నారు. అనంతరం కార్తీక మాసంలో ప్రతి సోమవారం చేయాల్సిన పనుల గురించి తెలిపారు. కార్యక్రమానంతరం ప్రసాద వితరణ చేశారు. కార్యకమ్రంలో వేద పండితులు, బెస్తకాలనీ ప్రజలు మండలంలోని అన్ని గ్రామాల నుంచి పెద్ద ఎత్తున నాయకులు ప్రజలు భక్తులు హాజరయ్యారు.

Updated Date - 2020-12-06T05:19:33+05:30 IST