నైట్ కర్ఫ్యూ ఎత్తివేసిన కర్ణాటక ప్రభుత్వం

ABN , First Publish Date - 2021-11-05T21:02:20+05:30 IST

కోవిడ్ పరిస్థితి మెరుగుపడిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అమల్లో ఉన్న రాత్రి కర్ఫ్యూను ఎత్తివేస్తున్నట్టు...

నైట్ కర్ఫ్యూ ఎత్తివేసిన కర్ణాటక ప్రభుత్వం

బెంగళూరు: కోవిడ్ పరిస్థితి మెరుగుపడిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అమల్లో ఉన్న రాత్రి కర్ఫ్యూను ఎత్తివేస్తున్నట్టు కర్ణాటక ప్రభుత్వం శుక్రవారంనాడు ప్రకటించింది. ప్రతి రోజు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ అమలు చేస్తున్న కర్ఫ్యూను ఉపసంహరించుకుంటున్నట్టు ఒక అధికార ప్రకటన విడుదల చేసింది. తక్షణమే ఈ ఆదేశాలు అమల్లోకి వచ్చినట్టు తెలిపింది. హార్స్ రేసింగ్‌కు కూడా తిరిగి అనుమతిస్తున్నట్టు పేర్కొంది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆదేశాలు, కోవిడ్ నిబంధనలను కఠినంగా పాటించాలని స్పష్టం చేసింది. హార్స్ రేసింగ్ వెన్యూలో సీట్ల సామర్థ్యానికి అనుగుణంగానే రేసింగ్ పాట్రన్లను అనుమతించాలని, వారు కూడా పూర్తి వ్యాక్సినేషన్ డోసులు తీసుకుని ఉండాలని ఆ ఆదేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.


వాక్సినేషన్ కవరేజ్ పెరగడం, కోవిడ్ కేసులు తగ్గడంతో కర్ణాటక ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. కర్ణాటకలో ఇంతవరకూ 29,89,275 కేసులు నమోదు కాగా, వాటిలో 8,267 యాక్టివ్ కేసులున్నాయి. 38,095 మంది ప్రాణాలు కోల్పోయారు. 19,42,884 మందికి స్వస్థత చేకూరింది. రాష్ట్రంలో 6.58 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసులు తీసుకున్టటు రాష్ట్ర ప్రభుత్వ గణాంకాలు తెలుపుతున్నాయి.

Updated Date - 2021-11-05T21:02:20+05:30 IST