తుంగభద్రకు కొనసాగుతున్న వరద

ABN , First Publish Date - 2022-07-11T02:24:11+05:30 IST

కర్ణాటకలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర జలాశయానికి వరద ప్రభావం కొనసాగుతోంది.

తుంగభద్రకు కొనసాగుతున్న వరద

కర్నూలు: కర్ణాటకలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర జలాశయానికి వరద ప్రభావం కొనసాగుతోంది. దీంతో జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది. ఆదివారం జలాశయానికి 80 టీఎంసీల నీరు చేరుకుంది. గేట్లు ఎత్తడానికి సిద్ధంగా ఉన్నామని బోర్డు అధకారులు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో నదితీర ప్రాంతాలను అప్రమత్తంగా చేయాలని రెవెన్యూ అధికారులకు కలెక్టర్‌ కోటేశ్వరరావు ఆదేశాలు జారీ చేశారు. తుంగభద్ర జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు ఉండగా 1626.22 అడుగులుగా ఉంది. జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వ 105.788 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం 80.549 టీఎసీలకు చేరింది. వరద ఇన్‌ఫ్లో 88279 క్యూసెక్కులు ఉండగా అవుట్‌ఫ్లో 231 క్యూసెక్కులు కొనసాగుతోంది.

Updated Date - 2022-07-11T02:24:11+05:30 IST