అనుమతి లేకుండా గోవాకు వెళ్లిన ప్రయాణికులకు రూ.10,000 జరిమానా
ABN , First Publish Date - 2022-04-21T22:14:53+05:30 IST
అనుమతి లేకుండా గోవాకు వెళ్లిన ప్రయాణికులకు రూ.10,000 జరిమానా
న్యూఢిల్లీ: అనుమతి లేకుండా గోవాకు వెళ్లినందుకు కర్ణాటక ప్రయాణికులకు పోలీసులు రూ.10,000 జరిమానా విధించారు. గుడ్ ఫ్రైడే, లాంగ్ వీకెండ్ సందర్భంగా ప్రత్యేక అనుమతి లేకుండా గోవాకు వెళ్లిన కర్ణాటక పర్యాటకులకు రూ.10,262 జరిమానా విధించారు. హిందుస్థాన్ టైమ్స్ నివేదిక ప్రకారం గోవాకు వెళ్లే మార్గంలో దాదాపు 40 ట్యాక్సీలను నిలిపివేసి జరిమానా విధించారు. లాంగ్ వీకెండ్లో ఆర్టీఓ కార్యాలయాలు మూతపడడంతో డ్రైవర్లు ప్రత్యేక అనుమతి పత్రాన్ని పొందలేకపోయారని తెలుస్తోంది.