take a tour: కర్ణాటకలో పర్యటించండి
ABN , First Publish Date - 2022-08-09T16:48:46+05:30 IST
యునెస్కో గుర్తింపు పొందిన ప్రపంచ వారసత్వ ప్రదేశాలు, అద్భుతమైన ప్రకృతి, వన్యప్రాణులతో అలరారుతున్న కర్ణాటకను సందర్శించాలని క
- కేఎస్టీడీసీ విజ్ఞప్తి
చెన్నై, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): యునెస్కో గుర్తింపు పొందిన ప్రపంచ వారసత్వ ప్రదేశాలు, అద్భుతమైన ప్రకృతి, వన్యప్రాణులతో అలరారుతున్న కర్ణాటకను సందర్శించాలని కర్నాటక స్టేట్ టూరిజం డెవల్పమెంట్ కార్పొరేషన్ (కేఎస్టీడీసీ) విజ్ఞప్తి చేసింది. సోమవారం నగరంలో జరిగిన విలేఖరుల సమావేశంలో కేఎస్టీడీసీ మేనేజింగ్ డైరెక్టర్ జి.జగదీశ(G. Jagadisha), డైరెక్టర్ టి.వెంకటేష్ తదితరులు విలేఖరులతో మాట్లాడుతూ.. కర్ణాటక(Karnataka)లో ఏడాది పొడవునా పర్యటించవచ్చన్నారు. చెన్నై సహా తమిళనాడులోని వివిధ ప్రాంతాల నుంచి ప్రయాణ సదుపాయాల కోసం తగిన చర్యలు చేపట్టినట్లు వివరించారు. తమ రాష్ట్ర పర్యాటకంపై ప్రచారంలో భాగంగా దేశంలోని పలు నగరాల్లో రోడ్షో(Roadshow)లు నిర్వహిస్తున్నట్టు వివరించారు.