రాష్ట్రమంతటా వరుణుడి కరుణ

ABN , First Publish Date - 2022-04-14T17:11:13+05:30 IST

వేసవి తాపంతో తల్లడిల్లుతున్న ప్రజలకు ఊరటనిచ్చేలా వరుణుడు కరుణించాడు. గడిచిన నె లన్నర కాలంగా రాష్ట్రమంతటా ఎండల ప్రభా వం రోజురోజుకు తీవ్రమైంది. ఇటీవల

రాష్ట్రమంతటా వరుణుడి కరుణ

                          - వేసవి తాపం నుంచి ఊరట


బెంగళూరు: వేసవి తాపంతో తల్లడిల్లుతున్న ప్రజలకు ఊరటనిచ్చేలా వరుణుడు కరుణించాడు. గడిచిన నె లన్నర కాలంగా రాష్ట్రమంతటా ఎండల ప్రభా వం రోజురోజుకు తీవ్రమైంది. ఇటీవల ఉత్తరకర్ణాటక ప్రాంతంలో ఒకటి రెండు చోట్ల వర్షాలు కురిసినా రాష్ట్రమంతటా వేడిమితో ప్రజలు ఇబ్బంది పడ్డారు. బుధవారం బెంగళూరుతోపాటు పలు ప్రాంతాలలో వర్షం కురిసింది. దీంతో సాయంత్రానికి చల్లటి వాతావరణం నెలకొంది. బెంగళూరు, మండ్య, మంగళూరు, ఉడుపి, ఉత్తరకన్నడ జిల్లాలతోపాటు మరిన్ని ప్రాంతాలలో ఓ మోస్తరుగా వర్షం కురిసింది. మండ్య పట్టణంలో ఈదురుగాలులతో 40 నిమిషాలకుపైగా వర్షం కురిసింది. బెంగళూరు - మైసూరు రహదారిపై నీరు నిలవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బెంగళూరులో ఆర్‌టీనగర్‌, జయనగర్‌, చామరాజపేట, మల్లేశ్వరం సహా నగరం అంతటా వాన కురిసింది. కాగా రానున్న ఐదురోజులపాటు దక్షిణాది రాష్ట్రాలు, ఈశాన్య ప్రాంతాలలోనూ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ పరిశోధనశాఖ ప్రకటించింది. రానున్న రోజులు కేరళ, లక్షద్వీప్‌, తమిళనాడు, పుదుచ్చేరితోపాటు కర్ణాటక తీర ప్రాంత జిల్లాలు, ఆంధ్రప్రదేశ్‌ తీర ప్రాంతాలో ఉరుములతో కూడిన వర్షాలు కురవవచ్చునని ప్రకటనలో పేర్కొంది. 

Updated Date - 2022-04-14T17:11:13+05:30 IST