కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం... 10 మంది మృతి

ABN , First Publish Date - 2022-03-19T15:53:13+05:30 IST

కర్ణాటక రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పావగడ తాలూకా పలవల్లి క్రాస్ సమీపంలో ఓ ప్రైవేట్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది.

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం... 10 మంది మృతి

బెంగళూరు: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం ఉదయం పావగడ తాలూకా పలవల్లి క్రాస్ సమీపంలో ఓ ప్రైవేట్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 10 మంది అక్కడికక్కడే మృతి చెందగా... మరో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద తీవ్రతను బట్టి చూస్తే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఓవర్‌లోడ్‌తో వెళ్తుండగా ఈ బస్సు ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Updated Date - 2022-03-19T15:53:13+05:30 IST