కర్ణాటకలో మరో 12 ఒమైక్రాన్ కేసులు వెలుగులోకి.. బాధితుల్లో 11 ఏళ్లలోపు చిన్నారులు

ABN , First Publish Date - 2021-12-23T22:09:57+05:30 IST

కరోనా నయా వేరియంట్ ఒమైక్రాన్ కేసులు దేశంలో చాపకింద నీరులా వ్యాప్తిం చెందుతున్నాయి..

కర్ణాటకలో మరో 12 ఒమైక్రాన్ కేసులు వెలుగులోకి.. బాధితుల్లో 11 ఏళ్లలోపు చిన్నారులు

బెంగళూరు: కరోనా నయా వేరియంట్ ఒమైక్రాన్ కేసులు దేశంలో చాపకింద నీరులా వ్యాప్తి చెందుతున్నాయి. తాజాగా కర్ణాటకలో మరో 12 కేసులు వెలుగుచూశాయి. వీటితో కలుపుకుని రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 31కి పెరిగింది. బాధితుల్లో 11 ఏళ్లలోపు ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు.


స్విటర్లాండ్ నుంచి వచ్చిన 9 ఏళ్ల చిన్నారి, యూకే నుంచి వచ్చిన 11 ఏళ్ల చిన్నారికి ఒమైక్రాన్ సోకినట్టు అధికారులు తెలిపారు. కాగా, దేశంలో ఇప్పటి వరకు 269 ఒమైక్రాన్ కేసులు వెలుగు చూశాయి. పెరుగుతున్న ఒమైక్రాన్‌కు అడ్డుకట్ట వేసేందుకు ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే చర్యలు ప్రారంభించింది.


క్రిస్మస్, న్యూఇయర్ రోజున ప్రజలు పెద్ద ఎత్తున ఒకే చోట చేరడంపై నిషేధం విధించింది. మరోవైపు, మహారాష్ట్రలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. 35 రోజుల తర్వాత తొలిసారి నిన్న రాష్ట్రంలో వెయ్యికిపైగా కేసులు నమోదయ్యాయి.

Updated Date - 2021-12-23T22:09:57+05:30 IST