కర్ణాటక పోలీసులపై ప్రధానికి కేరళ సీఎం లేఖ
ABN , First Publish Date - 2020-03-29T08:30:04+05:30 IST
కర్ణాటక పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని, రాష్ట్ర హైవేలను మూసేస్తున్నారని ఈ విషయంలో జోక్యం చేసుకుని రహదారులు తెరిచి ఉంచేలా చర్యలు తీసుకోవాలని కేరళ సీఎం...
తిరువనంతపురం, మార్చి 28: కర్ణాటక పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని, రాష్ట్ర హైవేలను మూసేస్తున్నారని ఈ విషయంలో జోక్యం చేసుకుని రహదారులు తెరిచి ఉంచేలా చర్యలు తీసుకోవాలని కేరళ సీఎం పినరయి విజయన్ ప్రధాని నరేంద్ర మోదీకి శనివారం ఓ లేఖ రాశారు. కర్ణాటకలోని కూర్గ్లో ఉన్న స్టేట్ హైవే-30 మీదుగా కేరళకు నిత్యావసరాలను తరలించాల్సి ఉందని, అయితే, ఆ రాష్ట్ర పోలీసులు ఈ హైవేని మూసేశారని విజయన్ తెలిపారు.