కేరళ నుంచి వస్తే 7 రోజుల క్వారంటైన్
ABN , First Publish Date - 2021-08-31T01:28:14+05:30 IST
కేరళలో కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్న రీతిలో పెరుగుతుండటంతో కర్ణాటక సర్కార్..
బెంగళూరు: కేరళలో కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్న రీతిలో పెరుగుతుండటంతో కర్ణాటక సర్కార్ అప్రమత్తమైంది. కేరళ నుంచి రాష్ట్రానికి వచ్చే వారు తప్పనిసరిగా ఏడు రోజుల పాటు ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్కు వెళ్లాల్సి ఉంటుందని, ఏడు రోజుల తర్వాత టెస్టింగ్ ఉంటుందని తెలిపింది. వ్యాక్సినేషన్ వేయించుకోవడం, ఆర్టీ-పీసీఆర్ రిపోర్ట్తో సంబంధం లేకుండానే కేరళ విజిటర్లను క్వారంటైన్కు పంపాలని నిర్ణయించినట్టు కర్ణాటక రెవన్యూ మంత్రి ఆర్.అశోక్ తెలిపారు. కేరళతో సరిహద్దులో పంచుకుంటున్న నాలుగు జిల్లాలు మినహా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ నైట్ కర్ఫ్యూ సడలిస్తున్నట్టు తెలిపింది. కొడగు, హసన్, దక్షిణ కన్నడ, ఉడిపి జిల్లాల్లో మినహా అన్ని జిల్లాల్లోనూ నైట్ కర్ఫ్యూ సడలించాలని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై అధ్యక్షతన జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.