కర్ణాటక మరో మంత్రికి కరోనా వైరస్

ABN , First Publish Date - 2020-07-13T15:23:23+05:30 IST

కర్ణాటక రాష్ట్ర మంత్రి సీటీ రవికి కరోనా పాజిటివ్ అని పరీక్షల్లో తేలింది.....

కర్ణాటక మరో మంత్రికి కరోనా వైరస్

బెంగళూరు (కర్ణాటక): కర్ణాటక రాష్ట్ర మంత్రి సీటీ రవికి కరోనా పాజిటివ్ అని పరీక్షల్లో తేలింది. మంత్రి రవికి కరోనా సోకగా, అతని భార్య పల్లవితోపాటు మంత్రి వ్యక్తిగత సిబ్బందికి కరోనా నెగిటివ్ అని వచ్చింది. ‘‘ నేను పరీక్ష చేయించుకోగా కరోనా పాజిటివ్ అని వచ్చింది...నేను క్షేమంగానే ఉన్నాను...నా భార్య పల్లవి, నా సిబ్బందికి జరిపిన పరీక్షల్లో కరోనా నెగిటివ్ అని వచ్చింది’’ అని మంత్రి సీటీ రవి ట్వీట్ చేశారు. తాను చికిత్స పొందుతూనే మంత్రిగా పనిచేస్తున్నానని రవి చెప్పారు. త్వరలో తాను కరోనా నుంచి కోలుకొని వస్తానని మంత్రి రవి వివరించారు.కర్ణాటక రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 36,216 కు చేరింది. 

Updated Date - 2020-07-13T15:23:23+05:30 IST