చిత్తూరు: జిల్లా గుండా అక్రమంగా తరలిస్తున్న కర్నాటక మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పెనుమూరు మండలంలో 60 కర్నాటక మద్యం బాటిల్స్ను పోలీసులు పట్టుకున్నారు. మద్యాన్ని తరలిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేసారు. పోలీసుల విచారణలో వీరు పాత నేరస్థులేనని తెలిసింది. నిందితులు గతంలో పెనుమూరు, యాదమరి, గంగాధర్ నెల్లూరు, పూతలపట్టు, కల్లూరు మండలాల్లోని పలు ఆలయాల్లో హుండీ చోరీలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.