కాలేజీ ప్రిన్సిపల్‌ని చెంపదెబ్బ కొట్టిన JDS నేత.. కారణం ఏంటో తెలుసా..

ABN , First Publish Date - 2022-06-22T22:58:52+05:30 IST

పిల్లలకు బుద్ధిపాఠాలు నేర్పించే ఓ కాలేజీ ప్రిన్సిపల్ అకారణంగా ఓ రాజకీయ నాయకుడి చేతిలో చెంపదెబ్బపడ్డారు. కర్ణాటకలోని మాండ్యాలో వెలుగులోకి వచ్చిన

కాలేజీ ప్రిన్సిపల్‌ని చెంపదెబ్బ కొట్టిన JDS నేత.. కారణం ఏంటో తెలుసా..

బెంగళూరు : పిల్లలకు బుద్ధిపాఠాలు నేర్పించే ఓ కాలేజీ ప్రిన్సిపల్(College) అకారణంగా ఓ రాజకీయ నాయకుడి చేతిలో చెంపదెబ్బపడ్డారు. కర్ణాటక(Karnataka)లోని మాండ్యా(Mandya)లో వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కాలేజీలో కంప్యూటర్ ల్యాబ్(computer lap) అభివృద్ధి పనుల పురోగతిపై స్పష్టమైన సమాధానం చెప్పని కాలేజీ ప్రిన్సిపల్‌ని JDS(జనతా దళ్(సెక్యూలర్)) నేత ఎం శ్రీనివాస్(M Srinivas) చెంపదెబ్బకొట్టారు. నల్వాడి క్రిష్ణ రాజా వెడియార్ ఐటీఐ కాలేజీ ఆధునీకరణ పనులను పర్యవేక్షణకు వెళ్లిన ఎం శ్రీనివాస్ కాలేజీ ప్రిన్సిపల్‌పై కోపంతో ఊగిపోయాడు. దీంతో అక్కడే ఉన్న అధికారులు, ఇతర స్థానిక నేతలు షాక్‌కు గురయ్యారు. కాగా చెంపదెబ్బ కొట్టే దృశ్యం కెమెరాలో రికార్డవడం(On camera)తో ఈ వీడియో వైరల్‌(Viral video)గా మారింది. కాగా మాండ్యాలో జూన్ 20న జరిగిన ఈ ఘటనపై జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్విటర్ వేదికగా పలువురు స్పందించారు. అక్కడే ఉన్న ప్రిన్సిపల్ సహచరులు నిశబ్ధంగా చూస్తుండిపోయారు.. ప్రిన్సిపల్‌కి మద్ధతుగా కార్యక్రమం నుంచి బయటకు వెళ్లిపోవచ్చు కదా అని ప్రశ్నించారు. 

Updated Date - 2022-06-22T22:58:52+05:30 IST