కర్ణాటకలో వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఏం చేశారో చూడండి..!

ABN , First Publish Date - 2020-06-03T03:35:34+05:30 IST

కర్ణాటక వైద్యఆరోగ్య శాఖ మంత్రి బి శ్రీరాములు సోషల్‌ డిస్టెన్స్‌ నిబంధనలను ఉల్లంఘించడం చర్చనీయాంశంగా మారింది. చిత్రదుర్గ జిల్లా చల్లకేరే తాలుకా...

కర్ణాటకలో వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఏం చేశారో చూడండి..!

కర్ణాటక: కర్ణాటక వైద్యఆరోగ్య శాఖ మంత్రి బి శ్రీరాములు సోషల్‌ డిస్టెన్స్‌ నిబంధనలను ఉల్లంఘించడం చర్చనీయాంశంగా మారింది. చిత్రదుర్గ జిల్లా చల్లకేరే తాలుకా పరశురాంపురలో ఆలయ ఉత్సవానికి శ్రీరాములు హాజరయ్యారు. ఈ సందర్భంగా భారీగా ఆయన అనుచరులు తరలివచ్చారు. ఆపిల్స్‌తో గజమాల వేసేందుకు అనుచరులు ప్రయత్నించారు. ఈ సందర్భంలో.. ఒకరిపై ఒకరు పడుతూ కేరింతలతో కేకలు వేశారు. భౌతిక దూరం అన్న మాటే మరిచారు. ఇక్కడ మరో కొసమెరుపేంటంటే.. సన్మానం ముగిసిన తర్వాత భౌతికదూరంపై శ్రీరాములు ఉపన్యసించారు.


మంత్రి శ్రీరాములు గాలి జనార్దన్‌రెడ్డి అనుచరుడన్న విషయం తెలిసిందే. శ్రీరాములు వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒక రాష్ట్రానికి వైద్య శాఖ మంత్రి అయి ఉండి.. ప్రజలకు భౌతిక దూరం ఆవశ్యకతను వివరించాల్సిన మంత్రే కరోనా తీవ్రత పెరుగుతున్న తరుణంలో ఇలా ప్రవర్తించడమేంటని మండిపడుతున్నారు.



Updated Date - 2020-06-03T03:35:34+05:30 IST