కర్ణాటక ధాన్యం రాకుండా నిఘా ఉంచాలి

ABN , First Publish Date - 2021-11-29T05:06:42+05:30 IST

వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కావడంతో పక్క రాష్ర్టాల నుంచి ధాన్యం ఇక్కడికి తీసుకువచ్చే ప్ర యత్నం చేస్తారని, కర్ణాటక, ఏపీ నుంచి తెలంగాణ లోకి ధాన్యం రాకుండా చూడాలని ఆర్డీవో రాములు అన్నారు.

కర్ణాటక ధాన్యం రాకుండా నిఘా ఉంచాలి
నందిన్నెలో సిబ్బందికి సూచనలు ఇస్తున్న ఆర్డీవో

- ఆర్డీవో రాములు 

- జిల్లా సరిహద్దు

 చెక్‌పోస్టుల పరిశీలన 

కేటీదొడ్డి/గట్టు/అలంపూర్‌చౌరస్తా, నవంబరు 28:   వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కావడంతో పక్క రాష్ర్టాల నుంచి  ధాన్యం  ఇక్కడికి తీసుకువచ్చే ప్ర యత్నం చేస్తారని, కర్ణాటక, ఏపీ నుంచి తెలంగాణ లోకి ధాన్యం రాకుండా చూడాలని ఆర్డీవో రాములు అన్నారు. ఆదివారం కేటీదొడ్డి మండలంలోని నం దిన్నె, గట్టు మండలం బల్గెర, ఉండవల్లి మండలం  పుల్లూరు టోల్‌ ప్లాజా, ర్యాలంపాడు,  రాజోలి, ఉన్న తెలంగాణ- కర్ణాటక - ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దులోని చెక్‌పోస్టులను ఆయన పరిశీలించారు. చెక్‌పోస్టుల ద గ్గర విధులు నిర్వహిస్తున్న రెవెన్యూ, పోలీస్‌ సిబ్బం దికి ఆర్టీవో రాములు పలు సూచనలు, సలహాలు చే శారు.  ఏపీ, కర్ణాటక నుంచి తెలంగాణలోకి వచ్చే అన్ని దారులలో నిఘా ఉంచాలన్నారు. కార్యక్రమం లో  డిఎస్పీ రంగస్వామి, అలంపూర్‌ సీఐ సూర్యనాయక్‌,  ఉండవల్లి తహసీల్దార్‌ వీరభద్రప్ప, ఎస్సై జగన్‌మోహన్‌, అలంపూర్‌ ఎస్సై శ్రీహరి, నందిన్నె సర్పంచు చిన్నభీమరాయుడు, గట్టు వ్యవసాయ మార్కెట్‌ సిబ్బంది దశరథరామిరెడ్డి, రెవెన్యూ సిబ్బంది, వ్యవసాయశాఖ అధికారులు, పోలీస్‌ సిబ్బంది, గ్రామస్థులు ఉన్నారు. 

Updated Date - 2021-11-29T05:06:42+05:30 IST