18న పేలనున్న మరో బాంబు
ABN , First Publish Date - 2022-04-16T17:15:43+05:30 IST
బెళగావి జిల్లా కేంద్రంగా రాష్ట్ర రాజకీయాలలో పెను దుమారం కొనసాగుతోంది. ఈ జిల్లాకే చెందిన మాజీ మంత్రి రమేశ్ జార్కిహొళి ఈనెల 18న కొన్ని కీలక సీడీలను మీడియా ముందు
- మాజీ మంత్రి రమేశ్ జార్కిహొళి
బెంగళూరు: బెళగావి జిల్లా కేంద్రంగా రాష్ట్ర రాజకీయాలలో పెను దుమారం కొనసాగుతోంది. ఈ జిల్లాకే చెందిన మాజీ మంత్రి రమేశ్ జార్కిహొళి ఈనెల 18న కొన్ని కీలక సీడీలను మీడియా ముందు ప్రవేశపెడతానని ప్రకటించారు. బెళగావి జిల్లాకు చెందిన కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ ఆత్మహత్య వెనుక ఓ బడా కాంగ్రెస్ నేత హస్తం ఉందని ఆయన ఆరోపిస్తున్నారు. ఇందుకు తగిన సాక్ష్యాధారాల తో కూడిన సీడీని మీడియా ముందు ప్రవేశపెడతానని ప్రకటించారు. తన మంత్రి పదవికి ఎసరు పెట్టినవారిపై ప్రతీకారం తీర్చుకునే దిశలో రమేశ్ జార్కిహొళి విడుదల చేయబోయే సీడీ ఏమై ఉంటుందోనని రాజకీయ వర్గాలలో తీవ్ర కుతూహలం నెలకొని ఉంది. బెళగావిలో శుక్రవారం మీడియాతో మాట్లాడిన రమేశ్ సోమవారం వరకు ఓపిక పట్టాలని సూచించడం విశేషం.