నాయకత్వ మార్పుపై తెలియదు: యడ్యూరప్ప

ABN , First Publish Date - 2021-07-17T07:19:09+05:30 IST

రాష్ట్రంలో పార్టీ నాయకత్వంలో ఎలాంటి మార్పులూ సంభవిస్తున్నట్లు తన దృష్టికి రాలేదని కర్ణాటక సీఎం యడ్యూరప్ప చెప్పారు. శుక్రవారం ..

నాయకత్వ మార్పుపై తెలియదు: యడ్యూరప్ప

బెంగళూరు: రాష్ట్రంలో పార్టీ నాయకత్వంలో ఎలాంటి మార్పులూ సంభవిస్తున్నట్లు తన దృష్టికి రాలేదని కర్ణాటక సీఎం యడ్యూరప్ప చెప్పారు. శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన అనంతరం యడ్యూరప్ప మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగానే రాష్ట్రంలో నాయకత్వ మార్పులపై కేంద్ర నాయకత్వం ఆలోచిస్తోందన్న వార్తలను ఖండించారు. ‘రాష్ట్ర నాయకత్వంలో మార్పులు చేయాలని జాతీయ నాయకత్వం ఆలోచిస్తున్నట్లు నాకు తెలియదు. మీకు తెలిస్తే చెప్పండి’ అని ఆయన మీడిపై చమత్కరించారు. రాష్ట్రంలోని కొన్ని అభివృద్ధి పనులను ముందుగా ప్రారంభించాలని కోరేందుకే ప్రధానిని కలిశానని, అదే విషయాన్ని ఆయనకు తెలియజేశానని యడ్యూరప్ప మీడియాకు తెలిపారు. కాగా.. యడ్యూరప్ప నాయకత్వంపై రాష్ట్ర బీజేపీ నేతల్లో కొందరు అసమ్మతి రేపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆయన ప్రధానిని కలిసి పరిస్థితిని వివరించారని, నాయకత్వం మార్పుపై కూడా చర్చించారని అంతకుముందు పుకార్లు వినిపించాయి.

Updated Date - 2021-07-17T07:19:09+05:30 IST