కరోనా తగ్గలేదుగా.. అందుకే మా అబ్బాయి కత్తితో కాకుండా ఐఫోన్‌తో కేక్‌ను కట్ చేశాడు.. తప్పేంటి.. ఓ ఎమ్మెల్యే వ్యాఖ్యలివి..!

ABN , First Publish Date - 2021-09-03T21:31:49+05:30 IST

కర్ణాటక ఎమ్మెల్యే బసవరాస్ దడేసుగుర్ కుమారుడు సురేశ్ ఇటీవల తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కరోనా తగ్గలేదుగా.. అందుకే మా అబ్బాయి కత్తితో కాకుండా ఐఫోన్‌తో కేక్‌ను కట్ చేశాడు.. తప్పేంటి.. ఓ ఎమ్మెల్యే వ్యాఖ్యలివి..!

ఇంటర్నెట్ డెస్క్: కర్ణాటక ఎమ్మెల్యే బసవరాజ్ దడేసుగుర్ కుమారుడు సురేశ్ ఇటీవల తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయి నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరోనా సంక్షోభం ఇంకా తొలగిపోలేదు. ..ఉపాధి లేక ఎంతో మంది అలమటిస్తున్నారు..ఇటువంటి సమయంలో మీరు డాబుదర్పాలు ప్రదర్శిస్తారా.. అంటూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. పుట్టినరోజు వేడుకల్లో ఎమ్మెల్యే కుమారుడు ..తన పేరులోని అక్షరానికో కేక్ చొప్పున కట్ చేశాడు. కత్తితో కాకుండా ఏకంగా ఐఫోన్‌తోనే కేక్ కట్ చేశాడు. 


అయితే..ఎమ్మెల్యే మాత్రం తన కుమారుడిని వెనకేసుకొచ్చే ప్రయత్నం చేశారు. సురేశ్ కష్టపడి సంపాదించిన డబ్బులతోనే పుట్టినరోజు సంబరాలు జరుపుకున్నాడని తేల్చి చెప్పారు. ఇది కరోనా కాలం కావడంతో.. కేక్ కట్ చేసేందుకు కత్తికి బదులు ఫోన్ వాడి ఉండొచ్చని కూడా చెప్పుకొచ్చారు. ఇక హోసపేటలో జరిగిన ఈ బర్త్‌డేపార్టీకి..సురేశ్ తన స్నేహితులతో కలిసి ఓ లగ్జరీ కారులో వెళ్లినట్టు కూడా వెల్లడైంది. దీంతో.. ఇది రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది.


సదరు ఎమ్మెల్యే బీజేపీకి చెందిన వారు కావడంతో ప్రతిపక్ష సభ్యులు ఎమ్మెల్యేపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. మరోవైపు..స్థానిక మీడియా కూడా ఈ విషయంలో పలు అంశాలను హైలైట్ చేసింది. తన వద్ద ప్రచారానికి డబ్బులు లేవని బసవరాజ్ గత ఎన్నికల్లో చెప్పినట్టు కథనాలు ప్రచురితరమయ్యాయి.  అంతేకాకుండా.. ప్రచార నిధులు కోసం ఎమ్మెల్యే అప్పట్లో క్రౌడ్ సోర్సింగ్ పద్ధతిలో నియోజకవర్గ ప్రజల నుంచే నిధులు సేకరించారట. అయితే..ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ఈ మూడేళ్లలో ఏకంగా మూడు లగ్జరీ కార్లు కొనుక్కున్నారట. ఈ నేపథ్యంలో.. ఎమ్మెల్యే కుమారుడి బర్త్ డే పార్టీ రాష్ట్రంలో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.   



Updated Date - 2021-09-03T21:31:49+05:30 IST