శాసనసభ్యుల జీతాల పెంపు బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

ABN , First Publish Date - 2022-02-23T01:45:52+05:30 IST

ముఖ్యమంత్రి, మంత్రులు సహా శాసన సభ్యుల జీతాలు పెంచే బిల్లుకు కర్ణాటక అసెంబ్లీ మంగళవారం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, మంత్రులు, ఎమ్మెల్యేలు..

శాసనసభ్యుల జీతాల పెంపు బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

బెంగళూరు: ముఖ్యమంత్రి, మంత్రులు సహా శాసన సభ్యుల జీతాలు పెంచే బిల్లుకు కర్ణాటక అసెంబ్లీ మంగళవారం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఈ జీతాల పెంపు వర్తించనుంది. శీతాకాల సమావేశాల్లో భాగంగా వరుసగా ఐదో రోజు సమావేశమైన అసెంబ్లీలో మంత్రి కేఈ ఈశ్వరప్ప చేసిన వ్యాఖ్యలపై తీవ్ర వివాదం చెలరేగింది. ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య సహా కాంగ్రెస్ నేతలంతా అసెంబ్లీలోనే నిరసన చేపట్టారు. అతి కష్టం మీద వారి చేత ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై నిరసన విరమింపజేశారు. అయితే మంగళవారం జీతాల పెంపుకు సంబంధించి రెండు బిల్లుల్ని సభలో ప్రవేశపెట్టగానే ఎలాంటి చర్చ కూడా లేకుండానే అన్ని పార్టీల సభ్యులు ఆమోదించారు. ఫిబ్రవరి 14కు ప్రారంభమైన కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు ఫిబ్రవరి 25తో ముగించాలని ప్రభుత్వం ముందే నిర్ణయించింది. కానీ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై సభలో చర్చించాలన్న కారణంతో మార్చి 4 వరకు పొడగించారు.

Updated Date - 2022-02-23T01:45:52+05:30 IST