కర్ణాటక కొత్త సీఎం ఎవరనే విషయంపై మరికాసేపట్లో క్లారిటీ!

ABN , First Publish Date - 2021-07-27T23:58:46+05:30 IST

బెంగళూరు: కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిని ఎంపిక చేసేందుకు బెంగళూరులో బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరుగుతోంది. అధిష్టాన పరిశీలకులుగా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, ధర్మేంద్ర ప్రధాన్ సమావేశానికి హాజరౌతున్నారు.

కర్ణాటక కొత్త సీఎం ఎవరనే విషయంపై మరికాసేపట్లో క్లారిటీ!

బెంగళూరు: కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిని ఎంపిక చేసేందుకు బెంగళూరులో బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరుగుతోంది. అధిష్టాన పరిశీలకులుగా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, ధర్మేంద్ర ప్రధాన్ సమావేశానికి హాజరౌతున్నారు. బీజేపీ ఎమ్మెల్యేల అభిప్రాయాలను తీసుకుంటున్నారు. మరికాసేపట్లో కొత్త ముఖ్యమంత్రి ఎవరనే విషయంపై క్లారిటీ రానుంది. ప్రస్తుతం సీఎం రేసులో కర్ణాటక హోం మంత్రి బసవరాజు బొమ్మై, అరవింద్ బెల్లాడ్, సీటీ రవి ఉన్నారు. బసవరాజు బొమ్మై పేరును ఆపద్ధర్మ ముఖ్యమంత్రి  యడియూరప్ప సూచించినట్లు సమాచారం. కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం గురువారం ఉండే అవకాశముంది. కొత్త కేబినెట్‌లో భారీ మార్పులు జరిగే అవకాశముందని భావిస్తున్నారు. 

Updated Date - 2021-07-27T23:58:46+05:30 IST