కర్ణాటక మద్యం పట్టివేత

ABN , First Publish Date - 2021-12-24T02:44:11+05:30 IST

జిల్లాలో అనుమతి లేకుండా తరలిస్తున్న కర్ణాటక మద్యాన్ని

కర్ణాటక మద్యం పట్టివేత

చిత్తూరు: జిల్లాలో అనుమతి లేకుండా తరలిస్తున్న కర్ణాటక మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. పలమనేరు, గంగవరం మండలం కంచర్ల ఉగిని క్రాస్ వద్ద మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక నుంచి అక్రమ మద్యం తరలిస్తున్న మారుతీ వ్యాన్, ద్విచక్ర వాహనాలను గంగవరం పోలీసులు సీజ్ చేశారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద ఉన్న కర్ణాటక మద్యం బాటిల్లను పోలీసులు సీజ్ చేశారు. పట్టుకున్న మద్యం విలువ రెండు లక్షల 36 వేల రూపాయల ఉంటుందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-12-24T02:44:11+05:30 IST