కర్ణాటక మద్యం పట్టివేత

ABN , First Publish Date - 2021-09-14T02:40:10+05:30 IST

జిల్లా గుండా అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యాన్ని ఎస్ఈబీ

కర్ణాటక మద్యం పట్టివేత

నెల్లూరు: జిల్లా గుండా అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యాన్ని ఎస్ఈబీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బుచ్చిరెడ్డిపాలెం కాగులపాడు వద్ద జాతీయ రహదారిపై భారీగా కర్ణాటక మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. స్కూటీపై తరలిస్తున్న 362 కర్ణాటక మద్యం బాటిళ్లని ఎస్ఈబీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


కర్నూలు జిల్లాలో

కర్నూలు: జిల్లాలోని ఎమ్మిగనూరు పరిధిలో అనుమతి లేకుండా తరలిస్తున్న కర్ణాటక మద్యాన్ని సెబ్ పోలీసులు పట్టుకున్నారు. 25 బాక్సుల కర్ణాటక మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల నుంచి షిఫ్ట్ కారు, ఒక బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యాన్ని తరలిస్తున్న ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేసారు. 

Updated Date - 2021-09-14T02:40:10+05:30 IST