కార్మికుల సంక్షేమ బోర్డును కొనసాగించాలి

ABN , First Publish Date - 2022-09-24T06:34:25+05:30 IST

కార్మికుల సంక్షేమ బోర్డును కొనసాగించాలి

కార్మికుల సంక్షేమ బోర్డును కొనసాగించాలి
కమిషనర్‌కు వినతిపత్రం అందజేస్తున్న టీఎన్‌టీయూసీ నాయకులు

గన్నవరం, సెప్టెంబరు 23 : భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును  కొనసాగించాలని టీఎన్‌టీయూసీ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ బుస్సే నాగ ప్రసాద్‌ అన్నారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన 1214 సర్కులర్‌ను రద్దు చేయాలని కోరుతూ కార్మిక శాఖ ప్రత్యేక కమిషనర్‌ కార్తికేయ మిశ్రాకు విజయవాడలో వినతి పత్రాన్ని టీఎన్‌టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెంటపల్లి శామ్యూల్‌ తో కలసి శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా నాగ ప్రసాద్‌ మాట్లాడుతూ గడచిన మూడేళ్లలో భవన నిర్మాణ   టీఎన్‌టీయూసీ నియోజకవర్గ అధ్యక్షుడు ఆళ్ల శ్రీనివాస నాయుడు పాల్గొన్నారు. 

ఉయ్యూరు  : భవన నిర్మాణ  కార్మికుల సమస్యలు, పెండింగ్‌లోని క్లెయిమ్స్‌ వెంటనే పరిష్కరించాలని టీఎన్‌టీయూసీ కార్యదర్శి కొసరాజు మల్లేశ్వరరావు డిమాండ్‌ చేశారు. కార్మికుల సమస్యలు పరిష్కరిం చాలని కోరుతూ టీఎన్‌టీయూసీ ఆధ్వర్యంలో శుక్రవారం ఉయ్యూరులో అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్‌కు వినతి పత్రం అందజేశారు.  ఈ ఈ కార్యక్రమంలో మునిపల్లి పౌలు, టి. సత్యనారాయణ, పెదసింగు వీరబాబు, అనుమకొండ శ్రీను, అబ్దుల్‌ కరీముల్లా తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-24T06:34:25+05:30 IST