కరీంనగర్లో టీఆర్ఎస్కు షాక్
ABN , First Publish Date - 2021-05-18T17:14:28+05:30 IST
జిల్లాలో అధికార పార్టీ టీఆర్ఎస్కు షాక్ తగిలింది. హుజురాబాద్లో ఎమ్మెల్యే ఈటలను వీణవంక
కరీంనగర్: జిల్లాలో అధికార పార్టీ టీఆర్ఎస్కు షాక్ తగిలింది. హుజురాబాద్లో ఎమ్మెల్యే ఈటలను వీణవంక ఎంపీపీ ముసిపట్ల రేణుక, తిరుపతి రెడ్డి మంగళవారం ఉదయం కలిశారు. ఇటీవల మంత్రి గంగులను కలిసి మద్దతు తెలిపిన రేణుక... రెండు రోజులకే ఈటల గూటికి చేరి టీఆర్ఎస్కు షాక్ ఇచ్చారు. కాగా స్కూల్ విషయంలో ఎలాంటి భయం వద్దని, అండగా ఉంటానని రేణుకకు ఈటల హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.