వర్షానికి డ్రైనేజీలో కొట్టుకుపోయిన ధాన్యం...రైతుల ఆగ్రహం
ABN , First Publish Date - 2021-11-14T16:31:34+05:30 IST
జిల్లాలోని గంగాధర వ్యవసాయ మార్కెట్లో భారీ వర్షాల కారణంగా ధాన్యం తడిసిపోయింది.
కరీంనగర్: జిల్లాలోని గంగాధర వ్యవసాయ మార్కెట్లో భారీ వర్షాల కారణంగా ధాన్యం తడిసిపోయింది. వర్షానికి ధాన్యం డ్రైనేజీలో కొట్టుకుపోవడంపై రైతులు ఆవేదన చెందుతున్నారు. నెల రోజులు అయినా అధికారులు ధాన్యం కొనడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ధాన్యం తడిసిందని రైతులు మండిపడ్డారు.