కరీంనగర్‌ ఆర్టీసీ రీజియన్‌కు ఉత్తమ ఇంధన పొదుపు అవార్డు

ABN , First Publish Date - 2020-02-20T10:22:12+05:30 IST

ఆర్టీసీలోని 11 రీజియన్లలో కరీంనగర్‌ రీజియన్‌ ఉత్తమ ఇంధన పొదుపు రీజియన్‌గా ఎంపికైంది. 2018-19 సంవత్సరంలో 5.71 కేఎంపీఎల్‌ సాధించి ఉత్తమ రీజియన్‌

కరీంనగర్‌ ఆర్టీసీ రీజియన్‌కు ఉత్తమ ఇంధన పొదుపు అవార్డు

ఆర్టీసీలోని 11 రీజియన్లలో కరీంనగర్‌ రీజియన్‌ ఉత్తమ ఇంధన పొదుపు రీజియన్‌గా ఎంపికైంది. 2018-19 సంవత్సరంలో 5.71 కేఎంపీఎల్‌ సాధించి ఉత్తమ రీజియన్‌ అవార్డును సొంతం చేసుకుంది. నగరంలో బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో సంస్థ ఎండీ సునీల్‌ శర్మ.. రీజియన్‌ అధికారులకు అవార్డును ప్రదానం చేశారు. అదేవిధంగా ఇంధన పొదుపులో గ్రామీణ ప్రాంత డిపోల్లో ఆర్మూర్‌ డిపో 5.88 కేఎంపీఎల్‌తో ఉత్తమ డిపోగా పురస్కారాన్ని సొంతం చేసుకుంది. పట్టణ ప్రాంతాల్లోని డిపోల్లో ఫలక్‌నుమా డిపో 5.36 కేఎంపీఎల్‌తో ఉత్తమ డిపోగా ఎంపికైంది. ఈ డిపోల మేనేజర్లకూ సునీల్‌ శర్మ పురస్కారాలను అందజేశారు. 

Updated Date - 2020-02-20T10:22:12+05:30 IST