జాతీయ బీసీ కమిషన్ ముందుకు కరీంనగర్ సీపీ

ABN , First Publish Date - 2022-01-20T22:11:47+05:30 IST

తన ఇంట్లో 317 జీవోపై దీక్ష చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి

జాతీయ బీసీ కమిషన్ ముందుకు కరీంనగర్ సీపీ

కరీంనగర్: తన ఇంట్లో 317 జీవోపై దీక్ష చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ సందర్భంగా జరిగిన పరిణామాలపై జాతీయ బీసీ కమిషన్ ముందు విచారణకు నగర సీపీ సత్యనారాయణ హాజరయ్యారు.  అరెస్ట్ సందర్భంగా సంజయ్‌పై దురుసుగా ప్రవర్తించినందుకు సీపీ సత్యనారాయణపై బీసీ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంట్లో నుంచి ఎంపీని బయటకు ఈడ్చుకు రావాల్సిన అవసరం ఏంటని బీసీ కమిషన్ ప్రశ్నించింది. ఎంపీ తన కార్యాలయంలో దీక్ష చేసుకుంటుంటే గ్యాస్ కట్టర్లు వినియోగించాల్సిన అవసరం ఏంటని మండిపడింది, కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించారని ఈనెల 2న బండి సంజయ్‌‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ సందర్భంగా సంజయ్‌పై  సీపీ దురుసుగా ప్రవర్తించారని బీసీ కమిషన్‌కు బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. 

Updated Date - 2022-01-20T22:11:47+05:30 IST