Karimnagar: చిట్ ఫండ్ మోసానికి యువకుడి బలి

ABN , First Publish Date - 2022-04-26T15:13:05+05:30 IST

ఓ చిట్ ఫండ్ మోసానికి యువకుడు బలి అయిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది.

Karimnagar: చిట్ ఫండ్ మోసానికి యువకుడి బలి

కరీంనగర్: ఓ చిట్ ఫండ్ మోసానికి యువకుడు బలి అయిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. జమ్మికుంటకు చెందిన పోతరాజు సతీష్ ఆత్మహత్య చేసుకున్నాడు. హనుమకొండలోని చిట్ ఫండ్‌లో ఏడు లక్షల కోసం సతీష్ నిరీక్షించాడు. అయితే డబ్బులు ఇవ్వకుండా చిట్ ఫండ్ కంపెనీ గత 14 నెలలుగా తిప్పించుకుంటూ ఉండటంతో మనస్తాపం చెందిన సతీష్ ఇంట్లో ఉరి వేసుకుని  బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2022-04-26T15:13:05+05:30 IST