కరపలో భవనంపై పడిన పిడుగు

ABN , First Publish Date - 2021-09-29T06:45:20+05:30 IST

కరపలో మంగళవారం మధ్యా హ్నం రెండంతస్థుల భవనంపై పిడుగు పడింది. అదృష్టవశాత్తూ ఆస్తి, ప్రాణనష్టం తప్పడంతో గ్రామస్తులు ఊపి రి పీల్చుకున్నారు. కరప-పేపకాయలపాలెం రహదారిని చేర్చి ఉన్న భవనంపై ఉన్నట్టుండి పిడుగు పడడంతో ఆ భీకర శబ్ధానికి స్థానికులు తలో దిక్కుకు పరిగెత్తారు.

కరపలో భవనంపై పడిన పిడుగు
కరపలో పిడుగుపాటుకు ధ్వంసమైన భవనం పిట్టగోడ

కరప, సెప్టెంబరు 28: కరపలో మంగళవారం మధ్యా హ్నం రెండంతస్థుల భవనంపై పిడుగు పడింది. అదృష్టవశాత్తూ ఆస్తి, ప్రాణనష్టం తప్పడంతో గ్రామస్తులు ఊపి రి పీల్చుకున్నారు. కరప-పేపకాయలపాలెం రహదారిని చేర్చి ఉన్న భవనంపై ఉన్నట్టుండి పిడుగు పడడంతో ఆ భీకర శబ్ధానికి స్థానికులు తలో దిక్కుకు పరిగెత్తారు. ఈ సమయంలో పైఅంతస్థు బాల్కానీలోఉన్న కుటుంబసభ్యులు లోపలికి పారిపోయారు. పిడుగు ప్రభావంతో పి ట్టగోడ ధ్వంసమై పక్కనే ఉన్న గోడౌన్‌పై రాళ్లు పడి దెబ్బ తింది. పిడుగు పడిన ప్రాంతానికి చేరువలో కరప ఎం పీపీ పెంకే శ్రీలక్ష్మిసత్తిబాబు నివాసముంటున్నారు. పిడు గు ధాటికి వారింట్లో టీవీ కాలిపోయింది. కొంతమంది ఇళ్లల్లో ఫ్రిజ్‌లు, బల్బ్‌లు మాడిపోయినట్టు చెబుతున్నారు.

Updated Date - 2021-09-29T06:45:20+05:30 IST