కరప మాజీ జడ్పీటీసీ సూరిబాబు మృతి
ABN , First Publish Date - 2020-09-29T17:54:32+05:30 IST
కరప జడ్పీటీసీ మాజీ సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు మామిడాల..
కరప: కరప జడ్పీటీసీ మాజీ సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు మామిడాల సూరిబాబు(73) సోమవారం అనారోగ్యంతో మరణించారు. కొంతకాలంగా ఆయన క్యాన్సర్తో బాధపడుతున్నారు. భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. గురజనాపల్లి ఆయన స్వగ్రామం.. ఆయనకు వైఎస్ రాజశేఖర్రెడ్డితో సత్సంబంధాలు ఉండేవని సన్నిహితులు చెబుతున్నారు. వ్యాపారులు సంతాప సూచికంగా బంద్ పాటించారు. కరప వ్యవసాయమార్కెట్ కమిటీ చైర్మన్ కర్నాసుల సీతారామాంజనేయులు, తాళ్లరేవు సమితి మాజీ అధ్యక్షుడు పబ్బినీడి సత్యనారాయణ, వైసీపీ మండల మాజీ అధ్యక్షుడు పబ్బినీడి పాపారావు, కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు పబ్బినీడి కృష్ణ, టీడీపీ నాయకుడు గట్టి రవి, మాజీ సర్పంచ్ బొడ్డు సత్యప్రసన్న, కవిచంద్ర మద్దా సత్యనారాయణ సంతాపం తెలిపారు.