కరణం.. ఆమంచి వర్గీయుల ఘర్షణ.. ఉద్రిక్తత

ABN , First Publish Date - 2020-11-01T03:57:06+05:30 IST

వేటపాలెం మండలం పందిళ్లపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మెల్యే కరణం బలరాం, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ వర్గీయుల ఘర్షణ జరిగింది. కర్రలు, రాళ్లతో...

కరణం.. ఆమంచి వర్గీయుల ఘర్షణ.. ఉద్రిక్తత

ప్రకాశం: వేటపాలెం మండలం పందిళ్లపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మెల్యే కరణం బలరాం, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ వర్గీయుల ఘర్షణ జరిగింది. కర్రలు, రాళ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు. దీంతో పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. 


కాగా కరణం బలరాం టీడీపీలో గెలిచి వైసీపీలోకి వెళ్లారు. అప్పటి నుంచి చీరాల నియోజకవర్గంలో కరణం వర్సెస్ ఆమంచిగా మారిపోయింది. ఇప్పటికే ఈ రెండు వర్గాలు పలుమార్లు దాడులకు దిగాయి. ఈ పంచాయితీ సీఎం జగన్ వద్దకు కూడా వెళ్లింది. అయినా సరే ఇలాంటివి జరుగుతున్నాయి. 

Updated Date - 2020-11-01T03:57:06+05:30 IST