కరాచీ యూనివర్సిటీలో కారుబాంబు పేలుడు.. నలుగురు చైనీయులు మృతి
ABN , First Publish Date - 2022-04-26T21:23:47+05:30 IST
ఇస్లామాబాద్: కరాచీ యూనివర్సిటీలో కారుబాంబు పేలింది. నలుగురు చైనీయులు మృతి చెందారు.
ఇస్లామాబాద్: కరాచీ యూనివర్సిటీలో కారుబాంబు పేలింది. నలుగురు చైనీయులు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. కరాచీ యూనివర్సిటీ క్యాంపస్లోని కన్ఫ్యూషియస్ ఇన్స్టిట్యూట్ సమీపంలో ఈ ఘటన జరిగింది. పేలుడు జరిగిన సమయంలో వాహనంలో 8 మంది ఉన్నారని సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న భద్రతా బలగాలు దర్యాప్తు చేపట్టాయి. మృతులు కన్ఫ్యూషియస్ ఇన్స్టిట్యూట్లో చైనా భాష నేర్పించే అధ్యాపకులని తేలింది.