రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి పై ఫిర్యాదు

ABN , First Publish Date - 2020-09-21T23:55:47+05:30 IST

రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి పై ఫిర్యాదు

రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి పై ఫిర్యాదు

అనంతపురం:  కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాల్లో రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రా రెడ్డి పై ఫిర్యాదు చేశారు. రాయదుర్గం ఎమ్మెల్యే , ఆయన మామ పాటిల్ హనుమంత రెడ్డి భూమిని కబ్జా చేశారని ఓ రైతు పిర్యాదు చేశాడు. సాగులో ఉన్న ఎనిమిది ఎకరాల భూమిని కబ్జా చేసారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కోర్టులో  అనుకూలంగా తీర్పు వచ్చినా దౌర్జన్యం చేస్తున్నారంటూ బాధితులు ఆరోపించారు. ఎమ్మెల్యే రామచంద్రారెడ్డికి  తాసిల్దార్, ఎస్ఐ వత్తాసు పలుకుతున్నారని, న్యాయం చేయాలంటూ కలెక్టర్ ఎస్పీలకు రైతు ఫిర్యాదు చేశాడు. 

Updated Date - 2020-09-21T23:55:47+05:30 IST