జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రీయ లోక్‌దళ్‌ పోటీ

ABN , First Publish Date - 2020-09-30T09:21:42+05:30 IST

త్వరలో జరగనున్న జీహెచ్‌ఎం సీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రీయ లోక్‌దళ్‌ (టీఆర్‌ఎల్‌డీ) పోటీ చేస్తుందని ఆ పార్టీ ...

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రీయ లోక్‌దళ్‌ పోటీ

బర్కత్‌పుర, సెప్టెంబర్‌ 29 (ఆంధ్రజ్యోతి): త్వరలో జరగనున్న జీహెచ్‌ఎం సీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రీయ లోక్‌దళ్‌ (టీఆర్‌ఎల్‌డీ) పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీ్‌పకుమార్‌ వెల్లడించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలతోపాటు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళలకు 90 శాతం సీట్లను కేటాయిస్తున్నట్లు ఆయన తెలిపారు. మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడమే లక్ష్యంగా జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నామన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో టీఆర్‌ఎల్‌డీ కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.  

Updated Date - 2020-09-30T09:21:42+05:30 IST