కన్యకాపరమేశ్వరికి లక్ష గాజుల పూజ
ABN , First Publish Date - 2022-08-20T05:05:13+05:30 IST
అశ్వారావుపేటలో ప్రసిద్ద ఆలయం కన్యకా పరమేశ్వరి ఆలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా నిర్వహించిన లక్ష గాజుల పూజ వైభవోపేతంగా నిర్వహించారు.
అశ్వారావుపేట రూరల్, ఆగస్టు 19: అశ్వారావుపేటలో ప్రసిద్ద ఆలయం కన్యకా పరమేశ్వరి ఆలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా నిర్వహించిన లక్ష గాజుల పూజ వైభవోపేతంగా నిర్వహించారు. ఉదయం అమ్మవారిని వివిధ రకాల గాజులతో అందంగా అలంకరించారు. అమ్మవారికి వివిధ రకాల ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహిళలు లక్ష గాజులు, కుంకుమ పూజలను నిర్వహించారు. కార్యక్రమానికి మహిళలు అధికంగా తరలివచ్చారు. భక్తులతో ఆలయ ఆవరణంతా కోలాహలంగా మారింది. పూజల అనంతరం మహిళలు లలితా సహస్రం పఠనం చేశారు. ఈసందర్భంగా ఆలయంలో మధ్యాహ్నం అన్నదానాన్ని నిర్వహించగా భక్తులు అధికంగా తరలివచ్చారు. సాయంత్రం ఆరు గంటల నుంచి ఆలయంలో అమ్మవారికి తిరిగి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు ముత్తా సుమాకర్, కమిటీ సభ్యులు, పెద్దలు, నిర్వాహకులు, భక్తులు పాల్గొన్నారు.