కంఠమహేశ్వర స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలి
ABN , First Publish Date - 2022-05-23T07:29:19+05:30 IST
గౌడకుల ఆరాధ్యదైవం కంఠమహేశ్వర స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. మండల కేంద్రంలో కంఠమహేశ్వరస్వామి సురమాంబదేవిల కల్యాణ మహోత్సవం సందర్భంగా ఆది వారం నిర్వహించిన పూజా కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు.
చిలుకూరు, మే 22: గౌడకుల ఆరాధ్యదైవం కంఠమహేశ్వర స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. మండల కేంద్రంలో కంఠమహేశ్వరస్వామి సురమాంబదేవిల కల్యాణ మహోత్సవం సందర్భంగా ఆది వారం నిర్వహించిన పూజా కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న కల్యాణ మహోత్సవాల చివరి రోజు బలిదానం, మోకు, ముస్తాదుల పూజలు, వన మహోత్సవ కార్యక్రమంతో ముగిసింది. కార్యక్రమాల్లో గౌడ సంఘాల జేఏసీ అధికార ప్రతినిధి, న్యాయవాది కేఎల్ఎన్ ప్రసాద్, డీసీసీబీ చైర్మన్ కొండా సైదయ్య, గౌడ సంఘం అధ్యక్షుడు సైదులు, ఎంపీటీసీ రమణ నాగయ్య, మాజీ సర్పంచ్ కడియాల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.