కాన్పూరులో దారుణం

ABN , First Publish Date - 2020-11-30T13:28:40+05:30 IST

సోదరుడి స్నేహితులే ఓ మైనర్ బాలికకు మత్తు మందు కలిపిన పానీయం తాగించి....

కాన్పూరులో దారుణం

కాన్పూర్ (ఉత్తరప్రదేశ్):  సోదరుడి స్నేహితులే ఓ మైనర్ బాలికకు మత్తు మందు కలిపిన పానీయం తాగించి సామూహిక అత్యాచారం జరిపిన దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ నగరంలో వెలుగుచూసింది. కాన్పూర్ నగరంలోని లాల్ బంగ్లా ప్రాంతానికి చెందిన ఓ మైనర్ బాలికపై ఆమె సోదరుడి నలుగురు స్నేహితులు అత్యాచారం చేశారు. మైనర్ బాలికకు నలుగురు స్నేహితులు మత్తు మందు కలిపిన పానీయం తాగించారు.బాలిక మత్తులోకి జారుకోగానే నలుగురు సామూహిక అత్యాచారం జరిపారు. ఈ ఘటనపై తాము ఐపీసీ సెక్షన్ 328, 342,363,376 (డి), పోస్కో చట్టాల కింద కేసు నమోదు చేశామని కాన్పూర్ ఎస్పీ రాజ్ కుమార్ అగర్వాల్ చెప్పారు. అత్యాచారం చేసిన ఇద్దరిని అరెస్టు చేశామని ఎస్పీ చెప్పారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామని ఎస్పీ చెప్పారు. బాలిక సోదరుడి స్నేహితులే ఈ దారుణానికి పాల్పడ్డారని పోలీసులు చెప్పారు. 

Updated Date - 2020-11-30T13:28:40+05:30 IST