డ్యాన్స్‌ చేస్తూ.. కుప్పకూలి.. కన్నా లక్ష్మీనారాయణ కోడలు మృతి

ABN , First Publish Date - 2020-05-29T07:47:36+05:30 IST

బీజేపీ ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ రెండో కోడలు సుహారిక(38) గురువారం ఓ

డ్యాన్స్‌ చేస్తూ.. కుప్పకూలి.. కన్నా లక్ష్మీనారాయణ కోడలు మృతి

రాయదుర్గం, మే 28 (ఆంధ్రజ్యోతి): బీజేపీ ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ రెండో కోడలు సుహారిక(38) గురువారం ఓ పార్టీలో డ్యాన్స్‌ చేస్తుండగా, కుప్పకూలి మృతిచెందారు. రాయదుర్గం ఇన్‌స్పెక్టర్‌ రవీందర్‌ కథనం ప్రకారం.. గచ్చిబౌలిలోని హిల్‌రిట్జ్‌ విల్లా్‌సలో సుహారిక, ఆమె భర్త ఫణిందర్‌, తల్లి మల్లిసాగరిక ఉంటున్నారు. గురువారం ఉదయం గచ్చిబౌలికి చెందిన పవన్‌రెడ్డి ఇంట్లో జరిగిన పార్టీకి, సుహారిక తన కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు. ఆ పార్టీలో ఉత్సాహంగా గడిపిన సుహారిక.. డ్యాన్స్‌ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు ఆమెను  ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.


గుండెపోటు వల్ల ఆమె మృతిచెంది ఉంటుందని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. రాయదుర్గం పోలీసులు ఆస్పత్రికి చేరుకుని, సమాచారం సేకరించారు. సుహారిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక వస్తేగానీ, సుహారిక మృతికి కచ్చితమైన కారణాలు చెప్పలేమని పోలీసులు తెలిపారు.

Updated Date - 2020-05-29T07:47:36+05:30 IST