నేను రాసిన రాసిన లేఖలకు సమాధానం చెప్పాలి: కన్నా
ABN , First Publish Date - 2020-05-26T23:36:15+05:30 IST
సింహాచలం భూములను కబ్జా చేసిన వారిపై కేసులు నమోదు చేయాలని బీజేపీ నేత కన్నా లక్ష్మి నారాయణ అన్నారు.
గుంటూరు: సింహాచలం భూములను కబ్జా చేసిన వారిపై కేసులు నమోదు చేయాలని బీజేపీ నేత కన్నా లక్ష్మి నారాయణ అన్నారు. జీవో 888 తీసుకొచ్చి 2016 నాటి ప్రొసిడింగ్స్నే కొనసాగిస్తున్నారని చెప్పారు. టీడీపీ నిర్ణయాలపై రివర్స్ టెండర్స్ నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. నాలుగు అంశాలపై తాను రాసిన లేఖలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దేవాలయాల భూములు విక్రయించమని స్పష్టమైన హామీ ఇవ్వాలన్నారు. తమ డిమాండ్స్పై బ్రిటీష్ పుత్రులు సమాధానం చెప్పాలని పేర్కొన్నారు.