టీడీపీ వాళ్లే పెట్టుబడులు పెట్టాలా?: కన్నబాబు

ABN , First Publish Date - 2020-10-02T08:23:52+05:30 IST

‘రాష్ట్రంలో టీడీపీకి సంబంధించినవారే పెట్టుబడులు పెట్టాలా? మిగిలినవాళ్లు పెట్టకూడదా? రూ.20లక్షల కోట్ల పెట్టుబడులు, 40లక్షల ఉద్యోగాలని సదస్సుల పేరుతో కోట్లు ఖర్చు చేసిన చంద్రబాబు.. ఎన్ని ఉద్యోగాలిచ్చారు? ఆయనలా మేం గ్రాఫిక్స్‌ చూపించడం లేదు’ అని వ్యవసాయ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు...

టీడీపీ వాళ్లే పెట్టుబడులు పెట్టాలా?: కన్నబాబు

అమరావతి, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): ‘రాష్ట్రంలో టీడీపీకి సంబంధించినవారే పెట్టుబడులు పెట్టాలా? మిగిలినవాళ్లు పెట్టకూడదా? రూ.20లక్షల కోట్ల పెట్టుబడులు, 40లక్షల ఉద్యోగాలని సదస్సుల పేరుతో కోట్లు ఖర్చు చేసిన చంద్రబాబు.. ఎన్ని ఉద్యోగాలిచ్చారు? ఆయనలా మేం గ్రాఫిక్స్‌ చూపించడం లేదు’ అని వ్యవసాయ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. కాకినాడ సెజ్‌ని సీఎం జగన్‌ కొట్టేయాలని చూస్తున్నారంటూ టీడీపీ సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు చేసిన విమర్శలపై మండిపడ్డారు. 1999-2004 మధ్య రాష్ట్రంలో 52 ప్రభుత్వ రంగ సంస్థల్ని చంద్రబాబు అమ్మేశారని ఆరోపించారు. కాకినాడ సెజ్‌ రైతులకు న్యాయం చేయాలనే ప్రభుత్వం కమిటీ వేసిందని చెప్పారు. కాగా.. రబీ సీజన్‌లో సాగు కోసం రైతులకు శనగ విత్తనాలను 5నుంచి పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. 

Updated Date - 2020-10-02T08:23:52+05:30 IST