హిందీ వస్తేనే భారతీయులా?
ABN , First Publish Date - 2020-08-10T06:48:19+05:30 IST
డీఎంకే ఎంపీ కనిమొళి కరుణానిధికి చెన్నై విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైంది. ఆదివారం విమానాశ్రయానికి వెళ్లగా సీఐఎ్సఎ్ఫకు చెందిన ఓ అధికారిణి కనిమొళితో హిందీలో మాట్లాడారు...
చెన్నై, ఆగస్టు 9: డీఎంకే ఎంపీ కనిమొళి కరుణానిధికి చెన్నై విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైంది. ఆదివారం విమానాశ్రయానికి వెళ్లగా సీఐఎ్సఎ్ఫకు చెందిన ఓ అధికారిణి కనిమొళితో హిందీలో మాట్లాడారు. తనకు హిందీ రాదని, తమిళంలో లేదా ఇంగ్లిషులో మాట్లాడాలని కనిమొళి కోరారు. దీంతో ఆ అధికారిణి ‘మీరు భారతీయులేనా?’ అని ప్రశ్నించింది. ఆగ్రహం చెందిన కనిమొళి ‘హిందీ వస్తేనే భారతీయులా’ అంటూ ట్వీట్ చేశారు. ఈ ఘటనపై కనిమొళికి సీఐఎ్సఎఫ్ క్షమాపణలు తెలిపింది.