ప్రమాద స్థితిలో కందూరు చెరువు కట్ట
ABN , First Publish Date - 2021-10-19T05:41:37+05:30 IST
రామసముద్రం మండలంలోని పెద్దకురవపల్లె పంచాయతీ పరిధిలోని కందూరు చెరువు కట్ట ప్రమాద స్థితికి చేరకుంది.
రామసముద్రం, అక్టోబరు 18: మండలంలోని పెద్దకురవపల్లె పంచాయతీ పరిధిలోని కందూరు చెరువు కట్ట ప్రమాద స్థితికి చేరకుంది. కొన్ని నెలలుగా కట్ట కుంగిపోతుండగా ఆయకట్టు రైతులు శ్రమదానం చేసి మట్టితోలి మరమ్మతులు చేపట్టారు. ఈ నేపథ్యంలో పది రోజులుగా కురుస్తున్న వర్షాలకు కట్ట మరింతగా కుంగిపోయి ఏ క్షణమైన తెగిపోవడానికి సిద్ధంగా ఉంది. ఇదే జరిగితే భారీ నష్టం జరుగుతుందని ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. మండలంలోని అన్ని చెరువులు నిండి మొరవలుపొతున్నాయి. ఈ క్రమంలో ఏ ఒక్క చెరువు తెగినావాటి ప్రభావం అన్ని చెరువులపై పడుతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఎస్ఐ రవీంద్రబాబు కట్టను పరిశీలించారు. అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.