ఐటీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా కంచర్ల శ్రీకాంత్
ABN , First Publish Date - 2021-10-19T06:22:47+05:30 IST
ఐ టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా కంచర్ల శ్రీకాంత్ చౌదరిని నియమించారు. సోమవారం విడుదల చేసిన రాష్ట్ర కమిటీలో ఈ మేరకు శ్రీకాంత్కి అవకాశం కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీకి తాను చేసిన సేవలు, పార్టీ అభివృద్ధే లక్ష్యంగా ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాల స్థాయి టీడీపీ శిక్షణ తరగతుల నిర్వహణ ద్వారా చేసిన సేవకు గుర్తింపుగా ఈ పదవి దక్కినట్లు భావిస్తున్నానని పేర్కొన్నారు.
కందుకూరు, అక్టోబరు 18: ఐ టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా కంచర్ల శ్రీకాంత్ చౌదరిని నియమించారు. సోమవారం విడుదల చేసిన రాష్ట్ర కమిటీలో ఈ మేరకు శ్రీకాంత్కి అవకాశం కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీకి తాను చేసిన సేవలు, పార్టీ అభివృద్ధే లక్ష్యంగా ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాల స్థాయి టీడీపీ శిక్షణ తరగతుల నిర్వహణ ద్వారా చేసిన సేవకు గుర్తింపుగా ఈ పదవి దక్కినట్లు భావిస్తున్నానని పేర్కొన్నారు. తనకు ఈ పదవి రావటానికి కారకులైన పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, నారా లోకేష్, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చన్నాయుడులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే ఎన్నికలలో టీడీపీ అధికారంలోకి రావటమే లక్ష్యంగా పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు.